ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012
మమత బెనర్జీ UPA  ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం జరిగినది. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ , మాయావతి నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ములాయం సింగ్ యాదవ్  ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా , వద్దా అనే తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించానున్నారు.ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ప్రారంభం అవుతుంది.నేను ఇదివరకే మీకు తెలియచేసినట్టుగా కొత్తగా ఏర్పాటు కాబడిన స్వింగ్ హై 5652 పైన నిఫ్టీ నిలదొక్కుకున్నట్టు ఐతేనే  మార్కెట్ లో  మరింత ర్యాలీ రావడానికి అవకాశం కలదు. మంగళవారం మొత్తం నిఫ్టీ 5586-5621 మధ్యనే కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి తక్షణ మద్దతు  5554, 5528,5465  వద్ద కలదు .ఒకవేళ  గ్యాప్ డౌన్ లో నిఫ్టీ   5554 క్రింద నిలదోక్కుకున్నట్టు 5528,5465  వరకు పతనం  కావడానికి అవకాశం కలదు. లాంగ్ పొజిషన్స్ కి మాత్రం 5466  బ్రేక్ కానంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 

1 comment:

Note: only a member of this blog may post a comment.