బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన లాభామా ? నష్టమా ? ఒకసారి వివరంగా తెలుసుకుందాం?


బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన లాభామా ? నష్టమా ?  ఒకసారి వివరంగా తెలుసుకుందాం?
చాలా మందికి బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం అంటే చాలా ఇష్టం.వారూ వారి జీవితంలో సంపాదించిన సంపద మొత్తం బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడానికే ఇష్టపడుతుంటారు.మన దేశంలో  కేవలం 4% కంటే తక్కువ మంది మాత్రమె స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగిలిన వారందరూ వారి జీవితంలో కస్టపడి సంపాదించిన డబ్బూ మొత్తం కేవలం బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు.నాకు చాలా అచ్చర్యం వేస్తుంది  ఎందుకు అంతగా బ్యాంక్ డిపాజిట్లపై మక్కువ చూపుతారో ? ఈ విషయంలో చాలా మంది ని నేను వారి అభిప్రాయం  కోరడం జరిగినది.  అందులో  యువత నుండి ఎనబై సంవత్సరాల వయస్సు వారూ కూడా ఉండటం జరిగినది. అధిక శాతం మంది  చెప్పిన సమాధానాలు క్రింది విధంగానే ఉన్నాయి.
1 SAFETY  :సాదారణంగా మనందరం మన డబ్బూ ఇన్వెస్ట్ చేసేసమయంలో  ముఖ్యంగా ఆలోచించేది మన డబ్బూ భద్రత గురించే. భద్రత విషయంలో  అందరం ఒకే రకంగా ఆలోచిస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.చాలా మంది స్టాక్ మార్కెట కంటే బ్యాంక్  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం లో చాలా భద్రత ఉంటుంది  అనే అభిప్రాయం లోనే ఉన్నారు.

2 LIQUIDITY IN EMERGENCY: చాలా మంది ప్రజల భావన  బ్యాంక్ లో   ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో డిపాజిట్లను సులభంగా నగదుగా మార్చుకొనే సౌకర్యం ఉండటం. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నే చాలా మంది స్టాక్ మార్కెట్ కంటే బ్యాంక్ లో    ఫిక్సుడ్ డిపాజిట్లు చేస్తున్నామని తెలియ చేయడం జరిగినది.  ఈ విషయంలో నేనే కాదు చాలా మంది ఆర్ధికవేత్తలు కూడా ఒప్పుకోవడం జరిగినది. ప్రజలూ కేవలం పై రెండు ఉద్దేశాలవలన అంటే  SAFETY మరియు LIQUIDITY IN EMERGENCY  కొరకు మాత్రమె బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం  జరుగుతుంది.కాని పై రెండు విషయాల పట్ల నా వాదన మాత్రమె కాకుండా ప్రముఖ ఆర్ధికవేత్తలు , ఫైనాన్స్ అడ్వయిజర్లు , ఆర్ధిక అక్షరాస్యత కలిగిన వారి  అభిప్రాయం మాత్రం వేరే  విధంగా ఉంటుంది.
అందరూ ముందుగా బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం  వలన అధిక భద్రత ఉంటుంది అనే మోజులో మీ డబ్బూ యొక్క విలువను తగ్గించే  రెండూ ముఖ్యమైన విషయాలు మర్చిపోతున్నారు .అందులో మొదటిది ఇన్ఫ్లేషన్ , రెండవది టాక్స్ . ఇన్ఫ్లేషన్ గురించి క్రింది  లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
http://telugufinancialschool.blogspot.in/2012_09_27_archive.html

ఇన్ఫ్లేషన్ అంటే మీ డబ్బూ యొక్క కనుగోలు శక్తి కాలంతో పాటు క్రమంగా తగ్గిపోవడం .మీ వద్ద నేడు లక్ష రూపాయలు ఉంటె పది సంవత్సరాల తర్వాత ఆ లక్ష రూపాయలతో పాటు వచ్చే  వడ్డీ కూడా కలిపి ఈ రోజు కనుగోలు చేసిన వస్తువులను , పది సంవత్సరాల తర్వాత మీరూ అదే వస్తువులను కనుగోలు చేయలేకపోవడం.అంటే మీరూ బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వలన వచ్చిన వడ్డీ వలన ఎలాంటి ఉపయోగం లేదు.
వాస్తవంగా చెప్పాలి అంటే మీ బ్యాంక్ వడ్డీ రేటు నుండి ఇన్ఫ్లేషన్ రేటు తగ్గిస్తే వచ్చేది వాస్తవమైన రాబడి. ఉదాహరణకు మీకు బ్యాంక్ వడ్డీ రేటు 8% వస్తే ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ 7% ( సాదారణంగా ఇన్ఫ్లేషన్ 5-6% నమోదు అవుతుంది.) ఐతే మీకూ వాస్తవంగా వచ్చిన రాబడి 8-7=1% మాత్రమే.మీ రాబడి పై టాక్స్ 1.5% అనుకుంటే మీకు వాస్తవంగా వచ్చే రాబడి = బ్యాంక్ అందించే వడ్డీ – ఇన్ఫ్లేషన్ – టాక్స్ అంటే మీ రాబడి   8-7-1.5 = -0.5%మాత్రమే.దీని వలన మీకు ఏమి అర్ధం అయినది. బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లు ఎలాంటి పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం లేదు.కాకపోతే ఈ విషయం మీకు కంటికి కనబడకుండా మీ  రాబడిని ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ మింగేస్తున్నాయి. అందువలన బ్యాంక్ డిపాజిట్లు  చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదు అని అర్ధం అయ్యింది కదా?. ఇక స్టాక్ మార్కెట్  విషయానికి వస్తే ఎలాంటి పరిస్తుతులలో  కూడా దీర్ఘకాలానికి  16-20% రాబడి ఖచ్చితంగా అందచేస్తున్నాయి.కావున  స్టాక్ మార్కెట్ లో రాబడి కనీసం 16% వచ్చిన మీ వాస్తవ రాబడి 16-7-0=9%  అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించగా మీ వాస్తవ రాబడి 9%  అవుతుంది అంటే మంచి రాబడే కదా ? స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పై ఎలాంటి టాక్స్  ఉండదు. స్టాక్ మార్కెట్ లో  స్వల్ప కాలంలో  ఒడిదుడుకులు ఉన్నప్పటికీ  దీర్ఘకాలం మాత్రం మంచి రాబడి అందిస్తుంది.
ఇక రెండవది బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వలన  LIQUIDITY IN EMERGENCY ఉంటుంది అంటారు. కాని మీరూ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎమర్జెన్సీ కోసం  మీరూ ఎమర్జెన్సీ ఫండ్  ఏర్పాటు చేసుకోవాలి .అంతే కాని మొత్తం డబ్బూ బ్యాంక్ లో   ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం మంచిది కాదు.కాబట్టి మీ వయస్సు కి అనుగుణంగా దీర్ఘకాలిక ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ పై మీకూ సరియైన అభిప్రాయం లేకుంటే కనీసం స్థిరాస్తి లో నయిన ఇన్వెస్ట్ చేయండి. అంటే స్థలాలు కొనడం లాంటిది.  బ్యాంక్ లో  బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడమంత తెలివి తక్కువ పని మరొకటి లేదు అనే విషయం తెలుసుకోండి.

ఈవారం స్టాక్ మార్కెట్19-11-2012to23-11-2012


ఈవారం స్టాక్ మార్కెట్19-11-2012to23-11-2012
 ఇంతకుముందు  మీకు తెలియచేసిన విధంగా గత చరిత్రను బట్టి చూస్తె  మార్కెట్  మూహరత్ ట్రేడింగ్ ముందు లేదా తర్వాత సుమారు 5-6% కదలిక ఉంటుంది అని మీకు తెలియచేయడం జరిగినది. అందుకు సిద్దంగా ఉండ్నది అని తెలియచేయడం కూడా జరిగినది.మూహరత్ ట్రేడింగ్ రోజు నిఫ్టీ హై 5708 నుండి ఇప్పటికే సుమారు 2%నష్టపోవడం జరిగినది.అదే విధంగా ఈ వారం మార్కెట్ గురించి చెప్పాలి అంటే 22 నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ శీతాకాల  సమావేశాలు , ఇజ్రాయిల్ దాడులు , అమెరికా  ఫిజికల్ క్లిఫ్ , వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేసే కామెంట్స్ , అంతర్జాతీయ మార్కెట్స్ ప్రభావం మోఅదలగు వాటి వలన  ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక టెక్నికల్ అనాలసిస్ విషయానికి వస్తే నిఫ్టీ అప్ ట్రెండ్ లైన్ దగ్గరకు సమీపిస్తుంది. నిఫ్టీ అప్ ట్రెండ్ లైన్ సపోర్ట్  5520 వద్ద కలదు. అదే విధంగా  నిఫ్టీ ఇంతకు ముందు ఏర్పరిచిన గ్యాప్ టాప్ కూడా 5520 వద్ద  మరియు ఫిబోనస్సీ సపోర్ట్ కూడా 5520-5525 వద్ద కలవు . అంటే నిఫ్టీ  5520-5525  వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక నిలదోక్కుకోనట్టు ఐతే నిఫ్టీ ఇంతకు ముందు ఎర్పరిచిన గ్యాప్ 5527-5448  వరకు నిఫ్టీ దిగజారి గ్యాప్ ను పూరించే అవకాశం కూడా కలదు.నిఫ్టీ ఇది వరకు రెండు సార్లు 50sma  క్రిందకు దిగాజారినప్పటికి  కూడా క్రింద నిలదొక్కు కోలేక  బిగ్ అప్ మూవ్ నిఫ్టీ లో రావడం జరిగినది. శుక్రవారం రోజు కూడా నిఫ్టీ 50sma క్రింద క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి తక్షణ రెసిస్టన్స్ 5585,5650 వద్ద కలవు. 5685 పైన క్లోజ్ కానంత వరకు  ప్రతి పై లెవల్ సెల్లింగ్ కొరకే ఉపయోగించుకోవాలి.అంటే సెల్ అన్ రైజ్. స్టాప్ లాస్ తప్పక ఉపయోగించండి.            


స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ? ఐతే మీరూ తప్పనిసరిగా చదవండి.?


స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ? ఐతే మీరూ  తప్పనిసరిగా చదవండి.?
మీరూ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించి ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా? అంటే ఈక్విటీ మార్కెట్,కమోడిటీ మార్కెట్ , కరెన్సీ , ఫారెక్స్ మార్కెట్  ఏదైనా కావచ్చు. మీరూ  ట్రేడింగ్ చేయాలి అనుకుంటేమాత్రం మీరూ ఇతరుల సలహాలపై లేదా టిప్స్ పై ఎట్టి పరిస్థుతులలో ఆధారపడవద్దు. మీరూ స్వయంగా స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగచేసుకొని , మీరూ స్టాక్ మార్కెట్ లో స్వయం నిర్ణయాలు తీసుకొనే శక్తి,అవగాహన,పరిజ్ఞానం సంపాదించిన తర్వాత మాత్రమే మీరూ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించడం లేదా ట్రేడింగ్ చేయడం ప్రారంభం చేయండి. దీనికి కొంత సాధన,కొంతసమయం పడుతుంది.అయినా సరే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగ చేసుకోవడం తప్పనిసరి.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు ఉంటుంది. కాని మీరూ ఎలాంటి అనుభవం లేకుండా ఇతరుల సలహాల, టిప్స్ పై ఆధారపడి కనుక మార్కెట్ లోకి ప్రవేశిస్తే మీవద్ద గల కాపిటల్ ఒక్కసారి నష్టపోతే మీరూ జీవితంలో మళ్ళీ స్టాక్ మార్కెట్ లో వచ్చే మంచి లాభాలు అందుకొనే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో టిప్స్ పై ఎత్తి పరిస్థుతులలో అధారపడవద్దు. స్టాక్ మార్కెట్ లో నా అనుభవం సుమారు పన్నెండు సంవత్సరాల పైననే. నా అనుభవంలో కొన్ని వేల మంది టిప్స్ అందించే వారిని చూడటం జరిగినది. అందులో చాలా మంది కనీసం మార్కెట్ పై సరియైన అవగాహన లేని వారే. ఏ టిప్ ఏ కారణం చేత ఇస్తున్నారో కూడా కనీసం సమాధానం చెప్పలేని వారే.  అందరూ అలాంటి వారే అని చెప్పలేను కాని  అధిక శాతం మంది అలాంటి వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ  టిప్స్ అందించే వారూ సమర్దులైనప్పటికి కూడా  ట్రేడింగ్ సమయంలో మార్కెట్ కదలికలకి  అనుగుణంగా స్పందిచే తత్త్వం ఒక్కొక్కరికి , ఒక్కోవిధమగా ఉంటుంది. టిప్స్ అందించే వారూ చెప్పేది ఒక్కటే గుడ్డిగా నేను చెప్పే టిప్స్ ను ఫాలో అవ్వండి అని. కాని అది ఎంత మాత్రం మంచిది కాదు. లైవ్ మార్కెట్ లోకి వచ్చే సరికి ప్రతి ఒక్కరిని వారి ఎమోషన్స్ , రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. మార్కెట్ లో ఒక్కో వ్యక్తీ రిస్కు తీసుకొనే సామర్ధ్యం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. అందువలన  మీరూ టిప్స్ అందించే వారూ ప్రతి రోజూ ఇంత లాభం , అంత లాభం అని చెప్పే మాయా మాటలు నమ్మి మోసపోకండి. వారికి లాభం వచ్చినది అని మీకూ రావాలి అని లేదు. అది మీ ట్రేడింగ్ సైకాలజీ పై ఆధారపడి ఉంటుంది. అందువలన వీలయినంత వరకు మీరీ స్వయంగా మార్కెట్ పై అవగాహన కలుగ చేసుకొనే ప్రయత్నం చేయండి. వీలయినంత వరకు పత్రికలలో  వచ్చే బిజినెస్ న్యూస్ , మంచి స్టాక్ మార్కెట్ పుస్తకాలు లేదంటే తెలుగులో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ పై నేను వ్రాసిన పుస్తకాలు కాని చదివి మార్కెట్ పై పూర్తీ అవగాహన పొందిన తర్వాత మాత్రమే మీరూ కస్టపడి సంపాదించిన డబ్బూ తో ట్రేడింగ్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే రిస్కు తో కూడుకున్నది అనే విషయం మర్చిపోవద్దు. కొన్ని సమయలాలో మీ డబ్బూ మొత్తం నష్టపోయే అవకాశం ఉంది అని మాత్రం మర్చి పోవద్దు.                          





డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?


డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?
డీమ్యాట్ ఖాతా తెరవటానికి ముందుగా మీరు మీ పేరున బ్యాంకు ఖాతా  తెరవండి. బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయందే డీమ్యాట్ ఖాతా తెరిచే అవకాశం ఉండదు. బ్యాంకు ఖాతా   తెరవడం వల్ల మీకే లాభం. భవిష్యత్తులో మీరు అందుకునే  డివిడెండు, వడ్డీ వారెంట్లపైనే  మీ ఖాతా సంఖ్యను ముద్రిస్తారు. ఇవి పోస్టులో మిస్సయినా  ఇతరులేవ్వరు మార్చుకోవటానికి  వీలుండదు. డీమ్యాట్ ఖాతా తెరిచిన తర్వాతా బ్యాంకు ఖాతాను మూసివేసినా, మరో ఊరికి  లేదా శాఖకు మార్చుకున్నా డిపాజిటరీ  పార్టిసిపెంట్  కు   తప్పకుండా వెంటనే  తెలియచేయండి.
బ్యాంకు ఖాతా తెరిచినా అనంతరం డీమ్యాట్ ఖాతా తెరవటానికి డిపాజిటరి పార్టిసిపెంట్స్ దగ్గరకు వెళ్ళండి.బ్యాంకులు లేదా బ్రోకరేజీ సంస్థలు డిపాజిటరి పార్టిసిపెంట్స్ గా వ్యవహరిస్తాయి.డీపీ దగ్గర దరఖాస్తు  పత్రంలో అన్ని వివరాలు  పూర్తిచేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు గుర్తింపు , చిరునామా దృవీకరణ పత్రాలు జతచేయాలి.సంతకం , ఫోటోలను నిర్ధారించడానికి  ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్నవారు సంతకం చేయాలి.ద్రువీకరించే వారు లేకుంటే పాసపోర్ట్, ఫోటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసన్స్ , పాన్ కార్డు ఉన్న చాలు.  ఇవి మీకు చిరునామా దృవీకరణకు కూడా ఉపయోగపడతాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో అసలు పత్రాలను తీసుకవెల్లడం  మరచిపోవద్దు..

పరిశీలన పూర్తీ చేసిన  తర్వాత నిర్దారిత  ఒప్పంద పత్రాలపై  సంతకాలు చేయాలి.మీ హక్కులు , బాధ్యతలు వివరంగా ఈ ఒప్పంద పత్రంలో ఉంటాయి.ఒప్పంద పత్రం ప్రతిని అడిగి తీసుకోవాలి.తర్వాత మీకు ఖాతా నంబరు ఇస్తారు .దీన్ని బెనిఫిషియరి వొనర్ ఐడెంటీకేషన్ నంబర్  అంటారు.
డీమ్యాట్ ఖాతా ఒక్కటే తెరవాలా?
ఒక్క వ్యక్తీ ఒక్క డీమ్యాట్ ఖాతానే తెరవాలన్న నిబందనేమి లేదు . అదే డీపీ వద్ద లేదా వేరే డీపీ ల వద్ద ఎన్ని ఖాతాలను ఐనా తెరవవచ్చు. మీ బ్రోకరుకు ఖాతా ఉన్న చోటనే తెరవాలి అన్న పట్టింపు లేదు. మీ భార్య /భర్త  లేదా పిల్లలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలనుకుంటీ మీ ఒక్కరి పేరునే ఖాతా ఉంటె సరిపోదు.మీరు ఎవ్వరి ఎవ్వరి పేరుమీదా  షేర్లు పొందాలి అనుకుంటే  వారి వారి పేర్లతో ఖాతా తెరవాలి.నామినేషన్  ఇవ్వడం కూడా చాలా ముఖ్యమే. ఇన్వెస్టర్ చనిపోయిన సందర్భంలో  చాలా మంది  డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ లేక వారసత్వ పత్రాల కొరకు  నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది..కావున నామినేషన్ అనేది చాలా ముఖ్యం.
చార్జీలు
డీమ్యాట్ ఖాతా నిర్వహణకు , ముందుగా ఖాతా తెరవటానికి  కొంత చార్జీలు చెల్లించాలి. కొందరు డీపీ లు ఎలాంటి చార్జీలు  వసూలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఖాతాదారులకు ఉచితంగా  డీమ్యాట్ ఖాతా  తెరిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి..డాక్యుమెంటేషన్ చార్జీలు. ప్రతి ఏటా ఖాతా  నిర్వహణకు  చార్జీలు చెల్లించాలి.ఈ చార్జీలు  ముందుగా చెల్లించాలి. దీనికి అదనంగా ప్రతి నెల కస్టోడియన్ ఫీజు చెల్లించాలి .ఖాతా లో ఉన్న సెక్కురిటీల సంఖ్య ( అంతర్జాతీయ సెక్కురిటీల గుర్తింపు సంఖ్య ఐ స్ ఐ న్ ) ను  బట్టి  ఈ ఫీజు ఆధారపడి ఉంటుంది. ఇక సెక్కురిటీలు అమ్మిన , కొన్న ప్రతి సారి కొంత చార్జీ చెల్లించాలి. నెలలో నిర్వహించిన లావాదేవీలకు కలిపి ఒక్కసారే వసూలు చేస్తారు. సర్వీసు చార్జీ అదనం. డీపీ తో పని లేకుండా ఇంటర్నెట్లో మీరే స్వయం గా   మీ లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.


స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి?


స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి? 

డీమ్యాట్ ఖాతా
మీరు  ప్రైమరీ మార్కెట్ లేదా సెకండరీ మార్కెట్  లలో  షేర్స్  కొనాలి అంటే  మీకు ముందుగా కావలసినది డీమ్యాట్ ఖాతా. షేర్ సర్టిఫికేట్లతో  ముడిపడిన అనేక సమస్యలకు  తెర దించుతూ  అమల్లోకి వచ్చింది కాగిత రహిత లావాదేవీల విధానం . దీనినే డీమ్యాట్ అంటారు. నేడు షేర్లు  కొనాలన్న ,అమ్మాలన్న ,ఈ విధానం తప్పనిసరి . పేరుకు తగ్గట్టు గానే  ఈ విధానం లో షేర్ సర్టిఫికెట్లు  ఉండవు. అంతా ఎలక్రానిక్ రూపంలోనే ఉంటుంది.ఎలక్రానిక్ రూపంలోకి మార్చిన షేర్లను కొనాలన్న, అమ్మాలన్న  డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) వద్ద ఒక ఖాతా (డీమ్యా ట్ ఖాతా) ను  తప్పని సరిగా తెరవాల్సి ఉంటుంది.అమ్మకాలు, కొనుగోళ్లను బట్టి మీ ఖాతాలో షేర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు  ఎలక్రానిక్ రూపంలో నమోదవుతాయి. ఒక విధంగా ఇది బ్యాంకు డిపాజిట్ లాంటిదే.బ్యాంకు లో మీరు సొమ్ము జమచేస్తే ఈ వివరాలు మీ ఖాతాలో జమ అవుతాయి.అలానే షేర్లు కూడా.
డిపాజిటరీ , డిపాజిటరి పార్టిసిపెంట్స్ అంటే ఏమిటి ?
ఇన్వెస్టర్లకు  చెందిన షేర్లను ఎలక్రానిక్ రూపంలో  భద్రపరిచే సంస్థలనే డిపాజిటరీలంటారు. రిజిస్టరైన డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) ద్వారా డిపాజిటరీలు సేవలు అందిస్తాయి.ప్రస్తుతం సెబి వద్ద రిజిస్టరైన సంస్థలు రెండు. అవి నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ .(ఎన్ఎస్ డీల్)మరియు  సెంట్రల్ డిపాజిటరీ  సర్వీస్ లిమిటెడ్ (సీడీఎస్ డీల్) .16 అంకెల్లో  ఖాతా నం ఉంటే  సీడీఎస్ ల్  ఖాతాగా,,అంకెలు ఇంగ్లీషు అక్షరాలూ  కలగలిసి ఉంటె  ఎన్ఎస్ డీ ల్ ఖాతా గా సులభంగా గుర్తించవచ్చు. 
డిపాజిటరీ ప్రతినిధినే డీపీ అంటారు. డిపాజిటరి పార్టిసిపెంట్స్ ద్వారనే  డిపాజిటరీలు ఖాతాదారులతో లావాదేవీలు నిర్వహిస్తాయి. సెబీ వద్ద రిజిస్టరైన సంస్థలు మాత్రమే డీపీగా   వ్యవహరించటానికి  వీలుంటుంది.డిపాజిటరీని బ్యాంకు గాను   డీపీని బ్యాంకు శాఖగాను  పరిగణించవచ్చు. ప్రస్తుతం 821డీపీ లు సెబీ వద్ద నమోదయ్యారు.

దేశంలో సంపద ఎలా స్ప్రుస్టించబడుతున్నదో తెలుసుకోండి ?


దేశంలో సంపద ఎలా స్ప్రుస్టించబడుతున్నదో తెలుసుకోండి ?
ఈ ఆర్టికల్ సంపద ఎలా స్ప్రుస్టించబడుతుందో తెలియచేస్తుంది.సంపద స్ప్రుస్టించడం  అంటే అంటే కొత్తగా సంపదని ఉత్పత్తి చేయడం అంటే ప్రభుత్వం ఏ విధంగా డబ్బూ ముద్రిస్తుందో అదే విధంగా  చేయడం.మీరూ అడగవచ్చు ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని? సంపద ఏ విధంగా స్ప్రుస్టించడం సాధ్యం అవుతుంది అని?. దానికి ఒకే ఒక సమాధానం మీరూ ఏదైనా కంపెనీ స్థాపించి దానిని  పబ్లిక్ వద్దకు తీసుకవేల్లడం అంటే IPOకి వెళ్లడం వలన సంపద నూతనంగా  క్రియేట్ చేయడం జరుగుతుంది.ఏ విధంగా జరుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం.

ఉదాహరణకు మీరూ ఒక కంపెనీనీ స్థాపించి దానిని రిజిస్టర్ చేసారు అనుకుందాం.మీకాపిటల్  రూ 1,00,000
(1 lac ) ఐతే దానిని 10,000 సమాన భాగాలుగా విభజిస్తే ఒక్కో వాటా విలువ రూ 10 అవుతుంది.అంటే రూ రూ 10 face valueగల  10,000 వాటాలు మీకంపెనీలో ఉన్నాయి. అవన్నీ కూడా మీవాటాలే. మీరూ మీ బిజినెస్ ను సమర్ధవంతగా నిర్వహించడంతో మీకంపెనీ 10-15 సంవత్సరాలలో మంచి వృద్ధిలోకి రావడంతో మీకంపెనీ విలువ రూ 10  కోట్లకు చేరుకుంది అని అనుకుందాం. ఇప్పుడు మీకంపెనీ నెట్ వర్త్ రూ10 కోట్లు కాబట్టి మీవద్ద  రూ 10 face valueగల 1 croreవాటాలు లేదా షేర్లు మీ వద్ద ఉంటాయి. ఎందుకంటె మీనెట్ వర్త్  రూ10కోట్లను  10 face value తో భాగించగా మీ వద్ద ఎన్ని వాటాలు ఉన్నాయో తెలుస్తుంది.  
అంటే మీ కంపెనీ   రూ 10 face valueగల 1 crore వాటాలతో లేదా షేర్లతో రూ 10 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నది. Sebiనియమనిబందనల ప్రకారం ఇప్పుడు మీరూ మీ కంపెనీని ప్రజల వద్దకు తీసుకవెళ్ళే అవకాశం కలదు.ఇప్పుడు మీరూ మీ కంపెనీలోగల మీ షేర్లనుండి 10% వాటాను ప్రజలకు IPO ద్వారా రూ  100 చొప్పున అమ్మడం ద్వారా , మీ కంపెనీలోకి కొత్త వాటా దారులను షేర్లు అమ్మడం ద్వారా తీసుకోవడంతో పాటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మీ షేరు ధర రూ100 పలుకుతుంది. మీ వద్ద గల రూ 10 face valueగల 1 crore షేర్లలో   10% వాటాను  అంటే పది లక్షల షేర్లను ప్రజలకు అమ్మారు. ఇంకా మీ వద్ద 90%  వాటాలు మీ వద్దనే ఉన్నాయి. అంతే కాకుండా రూ రూ 10 face valueగలమీ కంపెనీ షేర్ స్టాక్ మార్కట్ లో రూ  100  వద్ద ట్రేడ్ కావడం కూడా జరుగుతుంది.సరే ఇంతకు ముందు మీరూ  10% వాటాను అమ్మకముందు   మీ కంపెనీ నెట్ వర్త్ రూ10కోట్ల ఉంది కాదా ? ఇప్పుడు మీ వాటా అమ్మిన తర్వాత మీ కంపెనీ నెట్ వర్త్  ఎంత ఉందో తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో మీ కంపెనీ షేర్ రూ   100 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది కావున మీఒక్కో వాటా విలువ రూ100గా పరిగణించవలసి ఉంటుంది. కావున మీకంపెనీ మొత్తం 1crore వాటాలు కావున మీకంపెంనీ నెట్ వర్త్ రూ 100 కోట్లు అవుతుంది.ఈ విధంగా మీ కంపెనీ నెట్ వర్త్ నే మార్కెట్ కాపిటలైజేషన్  అంటారు.అంటే మీ కంపెనీ పబ్లిక్ వద్దకు వెళ్లడం వలన మీ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ100కోట్లు కాబడినది.  ఇందులో మీరూ కేవలం 10% వాటాను మాత్రమే అమ్మడం జరిగినది. ఇంకా మీవద్ద 90% వాటా ఉంది అంటే మీషేర్ల విలువ రూ90 కోట్లు .మీరూ మీ కంపెనీ ని స్థాపించి దానిని పబ్లిక్ వద్దకు తీసుకవేల్లడం వలన రూ100 కోట్లుదేశఎకానమీలోకి తీసుకరాగలిగారు.ప్రభుత్వం ఎలాంటి కరెన్సీ నోట్లు ముద్రించకుండానే మీ కంపెనీ వలన దేశ ఎకానమీలోకి  రావడం జరిగినది (on paper). దీనినే సంపద  స్ప్రుస్టించడం అంటారు. ఇంత సంపద సంపాదించడం దాదాపు సాధ్యం కాదు కాని  స్ప్రుస్టించడం సాధ్యం అవుతుంది.మీరూ  ఎప్పుడైనా  ఫోర్బ్స్ మేగజైన్ ప్రచురించే ప్రపంచ ధనవంతుల జాబితాను గమనించారా ? ఆ జాబితాలో ఉన్న ప్రతి ధనవంతుడు ఏదో ఒక కంపెనీని స్థాపించడం దానిని ప్రజల వద్దకు తీసుకవేల్లడం వలన మాత్రమే ధనవంతులు కాగలిగారు. ఎందుకంటె ఆ కంపెనీలో ఉండే వారి వాటా విలువ కొన్ని బిలియన్ డాలర్ల రూపాయలకు సమానం అవుతుంది.ప్రపంచంలో ఉన్న ధనవంతులు ఎవ్వరూ కూడా ఎకానమీలో సంపద నిర్మించిన వారూ కాదు సంపద స్ప్రుస్టించిన వారూ మాత్రమే. 

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంటా సిరులు కురిపించి మీరూ  ఆర్ధికంగా  ఉన్నతంగా ఎదగాలి అని కోరుకుంటూ మీ  తెలుగు ఫైనాన్సియల్ స్కూల్

దీపావళి ధమాకా : ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని మంచి షేర్లు

దీపావళి ధమాకా : ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని మంచి షేర్లు

ఈ దీపావళికి చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలో సలహా ఇవ్వగలరు అని చాలా మంది అడుగుతున్నారు.ఎవ్వరైనా సరే ఇన్వెస్ట్ చేయడానికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని కంపెనీలు మీకు తెలియచేయడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎన్నుకొని ఇన్వెస్ట్ చేయండి.ఒకవేళ మీరూ ఎక్కువ మొత్తం అమౌంట్ ఉంటే కనుక మీ పోర్ట్ ఫోలియో  డైవర్సిఫైడ్ గా ఉండేలా జాగ్రత్త పడండి.

 COAL INDIA LTD
 CMP: 345
TARGET: 410

AXIS BANK
CMP: 1184  
TARGET: 1476

CROMPTON GREAVES
CMP:125
TARGET : 150

ICICIBANK
CMP:1050
TARGET :1270

DB CORP
CMP:210
TARGET :260

UNITED PHOSPHOROUS
CMP:114
TARGET:170

LASERN & TURBO LTD
CMP:1274
TARGET :1500

INFOSYS LTD
CMP :2583
TARGET :3103

SBIN
CMP:1931
TARGET :2140

JK LAKSHMI CEMENT
CMP:125
TARGET:195

ఈవారం స్టాక్ మార్కెట్ 12-11-2012to16-11-2012


ఈవారం స్టాక్ మార్కెట్ 12-11-2012to16-11-2012

గత సంవత్సరం  మూహర్త్  ట్రేడింగ్ నుండి ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్ 8%,ఇండెక్స్ 20% లాభాలు జరిగినది. అదే విధంగా గత చరిత్ర పరిశీలిస్తే మూహర్త్  ట్రేడింగ్ ముందు లేదా తర్వాత  మార్కెట్ లో 5-6% కదలిక ఉండటం సర్వసాధారణం కాబట్టి , రాబోయో రోజుల్లో దానికి సిద్దంగా ఉండక తప్పదు.ఈ రోజు ప్రకటించే IIP డేటా మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. గత 14 ట్రేడింగ్ సెషన్స్ రేంజ్ ఐనటువంటి  5637-5725 బ్రేక్ జరిగి కొత్తగా నిఫ్టీ  5585- 5777 రేంజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కనబడుతుంది.నిఫ్టీ కి తక్షణ మద్దతు  5677వద్ద కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కోల్పోయినట్టు ఐతే ఇంతకు ముందు ఏర్పాటు కాబడిన స్వింగ్ లో ఐనటువంటి 5585 వద్దకు నిఫ్టీ చేరుకోగలదు. ఒకవేళ 5677 వద్ద సపోర్ట్ పొందితే మాత్రం న్యూ 52  వీక్ హై  ఏర్పాటు కావడానికి అవకాశం కూడా కలదు.నిఫ్టీ సపోర్ట్ 5677, 5645, 5585 , రెసిస్టన్స్  5725,5752,5777,5815 వద్ద కలవు.

లోన్స్ ద్వారా సంపద ఎలా స్ప్రుస్టించు కోవచ్చు?


లోన్స్ ద్వారా సంపద ఎలా స్ప్రుస్టించు కోవచ్చు?
లోన్స్ తీసుకొని కూడా సంపద స్ప్రుస్టించు కోవచ్చు అనే విషయం మీకు తెలుసా ? ఈ విషయం మీకు వినడానికి అచ్చర్యంగా ఉండవచ్చు.అప్పు ద్వారా ఎలా సంపద  స్ప్రుస్టించుకోవడం సాధ్యం అవుతుంది అని ఆలోచిస్తున్నారా ? వాస్తవానికి అప్పులకు దూరంగా ఉండటం , ఉన్న అప్పులను వదిలించుకోవడం , క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్న కూడా వాటిని వదిలించుకోవడం మీరు తప్పనిసరిగా చేయాలి అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే .పైన చెప్పిన సలహా సాదారణంగా   ఆర్ధిక క్రమశిక్షణ ,ఆర్ధిక అక్షరాస్యత లేని వారికి వర్తిస్తుంది.  అదే మీరూ ఆర్ధిక అక్షరాస్యత కలిగి ఉండి , ఫైనాన్సియల్  స్టేట్మెంట్స్ చదవగలిగి ఉంది ఉంటే మీకు లోన్స్ కూడా రెండు రకాలు ఉంటాయి అనే విషయం తెలిసి  ఉంటుంది. అవి గుడ్ లోన్స్ మరియు బ్యాడ్ లోన్స్ .
సాదారణంగా బ్యాడ్ లోన్స్ వలన మీ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది తప్ప వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు లోన్స్ తీసుకొని విహర యాత్రలకు వెళ్లడం,కార్స్ , లాప్ టాప్స్ , ఖరీదైన మొబైల్స్ , ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం,  ఇక గుడ్ లోన్స్ అంటే  లోన్స్ తీసుకొని వాటి ద్వారా బిజినెస్ ప్రారంబించడం , ఎడ్యుకేషన్ కొరకు ఉపయోగించడం , అద్దె ఆదాయం పొందడం కొరకు ఉపయోగించడం లేదా ఏదైనా ఆస్థి ఏర్పాటు కొరకు ఉపయోగించేవి గుడ్ లోన్స్.అంతే కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ను కాపాడుకోవడానికి తీసుకొనే  లోన్స్ కూడా గుడ్ లోన్స్. ఒక ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరూ పది సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించేలా ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం. సుమారు ఐదు సంవత్సరాల  అనంతరం మీకు గుండె పోటూ వచ్చి మీకూ డబ్బు అత్యవసరమై  మీ ప్లాట్ కనుక అమ్మివేస్తే మీరూ కాపిటల్ గెయిన్  టాక్స్ చెల్లించడమే కాకుండా భవిష్యత్తులో మీ ప్లాట్ ద్వారా పెరిగే కాపిటల్ గెయిన్  నష్టపోవడమే కాకుండా మీరూ మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించలనుకున్న కాలం కంటే ముందే అమ్మివేయడం వలన మీ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కూడా లేదు.అందువలన ఇలాంటి సమయంలో మీరూ షార్ట్ టర్మ్ లోన్స్ ఏదైనా తీసుకొని మీ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ఐనటువంటి మీ ప్లాట్ ను అమ్మకుండా కాపాడుకోగలుగుతారు కాబట్టి ఇది గుడ్ లోన్స్  .  
మీరూ ఏదైనా వ్యాపారం ప్రారంభం  చేయాలి అనుకుంటారు కాని మీ వద్ద డబ్బూ లేకపోవడంతో బ్యాంక్స్ నుండి, స్నేహితులనుండి అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేసారు అనుకుందాం. మీరూ ఈ విధంగా అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేయడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటె మీరూ చేసే వ్యాపారం మీకూ ఆదాయాన్ని అందివ్వగలుగుతుంది  కాబట్టి ఇది గుడ్ లోన్స్.   
మీరూ ఒక విలాసవంతమైన కారు కొనాలి అనుకొని లోన్ తీసుకొని కారు కొనడం బ్యాడ్ లోన్స్ క్రిందకు వస్తుంది.మీరూ కొత్తగా తీసుకున్న కారు ఖరీదు మొదటి నాలుగు సంవత్సరాలలోనే అరవై శాతం వరకు తరుగుదల ఉంటుంది.అంతే కాకుండా మీరూ కారు కోసం తీసుకున్న లోన్స్ వలన మీ ఆదాయం వృద్ది చెందటం కాని , కారు విలువ పెరగటం కాని జరగక పోగా మీ కారు విలువ ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది.
ఇప్పుడు మీకూ గుడ్ లోన్స్ కి మరియు బ్యాడ్ లోన్స్ కి మధ్యగల తేడా అర్ధం అయినది అనుకుంటాను. ఎప్పుడూ కూడా మీరూ తీసుకొనే లోన్స్ ద్వారా మీ ఆదాయం లేదా మీ ఆస్థి వృద్ది చెందడానికి ఉపయోగపడేలా ఉండాలి . అంతేకాని విలువ కోల్పోయే వాటి కోసం లోన్స్ తీసుకోవద్దు. బ్యాంకు లు వారి లాభాలు పెంచుకోవడానికి సాదారణ ప్రజానీకాన్ని ప్రలోభపెట్టె విధంగానే వారి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి.కాబట్టి లోన్స్ తీసుకొనే సమయంలో విచక్షణతో మెలగండి.

ఈ దీపావళికి బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?

ఈ దీపావళికి బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?


దీపావళి సంబరాలు దగ్గరకు వచ్చేసాయి. సాదారణంగా  హిందువులు అధికంగా దీపావళి ముందు వచ్చే దన్ తే రాస్ నాడు బంగారాన్ని కొనడం లేదా బంగారం లో ఇన్వెస్ట్ చేయడం చాలా కాలం నుండి సంప్రాదాయబద్దంగా చేస్తున్నారు.చాలా మంది ఆ రోజు బంగారం కొనడానికి సిద్దంగా ఉన్నారు.

గత కొన్ని రోజుల నుండి బంగారంలో స్వల తగ్గుదల జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే.ఈ నెల  వ తేదిన బంగారం ధర రూ 30950 నమోదు కావడం జరిగినది. ఈ విధంగా బంగారంలో తగ్గుదల వలన  ఈ సంవత్సరం   దన్ తే రాస్  నాడు  బంగారం కోటే లాభదాయకంగా ఉంటుందా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు.
మీరూ గత సంవత్సరం దన్ తే రాస్  నాడు  10gm బంగారం రూ   26750 వద్ద కనుగోలు చేసి ఉంటే నేడు  10gm బంగారం రూ 30950 వద్ద ఉంది. అంటే మీకు సంవత్సరంలో వచ్చిన రాబడి సుమారు ( cagr) 15.70% . అంటే సంవత్సరంలో 15.70% రాబడి అంటే చాలా మంచి రాబడి అందుకోవడం జరిగినట్టే. అదే విధంగా ఈ సంవత్సరం దన్ తే రాస్  నాడు  బంగారం కనుగోలు చేస్తే వచ్చే దన్ తే రాస్  నాటికి కూడా రాబడి ఈ విధంగానే వస్తుంది అని అంచనా వేస్తే అప్పుడు బంగారం ధర సుమారు రూ 35810 వద్ద ఉండగలదు.
గత కొంత కాలం నుండి బంగారంలో పెరుగుదల వేగంగా జరిగినప్పటికీ కూడా అనలిస్టులు బంగారం ధర ఇంకా పెరగడానికే అధిక అవకాశం ఉంది అని అంచనా వేయడం జరుగుతుంది.కనీసం రాబోయే సంవత్సర కాలంలో బంగారం రూ  33890నుండి   38000వరకు మధ్య చలించడానికి అధిక అవకాశం ఉంది. అంటే కనీసం రాబడి 10% to 20% వరకు ఉండగలదు.గత కొద్ది రోజులుగా బంగారం లో నమోదు అవుతున్న తగ్గుదల కనుగోలు చేయడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ఐతే మీరూ బంగారాన్ని కనుగోలు జ్వేల్లరీ రూపంలో చేస్తే  మేకింగ్ చార్జీల  రూపంలో నష్టపోవలసి వస్తుంది. అంతే కాకుండా వ్యాట్ కూడా చెల్లించవలసి ఉంటుంది.కాయిన్స్ లేదా బార్స్ రూపంలో కనుగోలు చేసిన కూడా వ్యాట్ చెల్లించవలసి ఉంటుంది. అందువలన మీరూ గోల్డ్ ఈటిప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. గోల్డ్  ఈటిప్ ద్వారా మీరూ కేవలం గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు.అందువలన ఈ దీపావళి సందర్భంగా మీరూ కనీసం ఒక గ్రాం బంగారం ఐనా కనుగోలు చేయడం మంచిది.